KTR:అభివృద్ధిని చెప్పుకోలేకే ఓటమి

18
- Advertisement -

చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకే ఓటమి పాలయ్యామని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీలో చిట్ చాట్‌గా మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ప్రజలతో మాకు గ్యాప్ వచ్చిందన్నారు. మా వైఖరి మార్చుకోవాలి…ప్రజలది తప్పు అనడమంటే..మాది తప్పు అన్నారు. హైదారాబాద్ లో అన్ని సీట్లు గెలిచాం… అభివృద్ధిని మేము చెప్పుకోలేదు అన్నారు.

తెలంగాణ పేరు మార్చడం వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదని…పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయినా 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదని…పవన్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవి అన్నారు.

ప్రతిరోజూ జనంలోకి వెళ్ళే కేతిరెడ్డి ఓడిపోవడం..సంచులతో దొరికినవాడు సీఎం అయ్యాడు అని చెప్పారు. జగన్ ను ఓడించేందుకు షర్మిల ను ఒక వస్తువులా ఉపయోగించారని…అంతకు మించి షర్మిల ఏమీ లేదు అన్నారు. మాకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారు…ఆత్మవిశ్వాసం, అహంకారానికి తేడా తెలియదు అన్నారు. అభివృద్ధిలో మాతో పోటీ పడలేని వారే అహంకారం అని ప్రచారం చేశారన్నారు.

Also Read:ఈ రెండు అలవాట్లతో సంతానలేమి సమస్యే!

- Advertisement -