ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం

6
- Advertisement -

రాజీవ్ ఆరోగ్య శ్రీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. కాంట్రాక్ట్ అండ్ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన రాజనర్సింహ…సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు.

ఆరోగ్యశ్రీ సిబ్బంది వేతనాలు, ఆరోగ్య మిత్ర డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ స్ట్రెంత్ పెంపుదల పై తెలంగాణ రాజీవ్ ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గిరి యాదయ్య, అసోసి యేషన్ ప్రధాన కార్యదర్శి కుమార్, ఇతర జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు, రాష్ట్ర ముఖ్య నాయకులు తాళ్ల నాగేష్ గౌడ్, తుమ్మల రాజు, వజ్ర, నాగరాజు విష్ణు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read:‘రేవు’..పార్టీలో హేమా హేమీలు

- Advertisement -