BRS:పోచారం..లంక పుత్రుడు

10
- Advertisement -

కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. పోచారం లక్ష్మీ పుత్రుడు కాదని లంక పుత్రుడని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి…పోచారం పార్టీ మారడం సిగ్గుచేటు అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన నియోజకవర్గానికి ఎక్కువ నిధులు పొందింది పోచారం అని..ఇవాళ ఇసుక, క్రషర్ దందాల కోసం పార్టీ మారారని ఆరోపించారు.రైతులకోసం ఆయన పార్టీ మారలేదని ఇది అందరికి అర్ధమైందన్నారు.పార్టీ మారాలనుకున్న నేతలు ఎమ్మెల్యే పదవులకు రాజీనామాచేసి పోవాలన్నారు.

రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ లో చేరుతున్నాఅని అప్పట్లో పోచారం చెప్పారని…ఇప్పుడు పదవుల కోసం పార్టీ మారడం సిగ్గుచేటన్నారు మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా.బీఆర్ఎస్ లో ఆయనతో పాటు కొడుకు, వియ్యంకుడు పదవులు అనుభవించారని…వీళ్లకు ప్రజలు సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారని అన్నారు. రాజీనామా చేసి దమ్ముంటే గెలవాలని పోచారం శ్రీనివాసరెడ్డికి సవాల్ ఇచ్చారు గణేష్ గుప్తా.

Also Read:TTD:టీటీడీ ధరల్లో మార్పు..పుకార్లే

- Advertisement -