Chandrababu:ఏపీ అంటే అమరావతి

6
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం అని చెప్పారు టీడీపీ అధినేత,సీఎం చంద్రబాబు. అమరావతిని సందర్శించిన అనంతరం మాట్లాడిన బాబు..ఇక్కడి రైతుల పోరాటం భావి తరాలకు ఆదర్శమన్నారు. ప్రపంచం అంతా అమరావతిని గుర్తించిందన్నారు.

అమరావతి, పోలవరం ఏ ఒక్కరి సొత్తు కాదని తెలిపారు. అమరావతి రైతులు 1,631 రోజులు ఆందోళన చేపట్టారని..అటువంటి రాజధానిని వైసీపీ సర్కారు నాశనం చేసిందని చెప్పారు. పోలవరం వల్ల రైతులకు మేలు జరిగేదని చెప్పారు. రాజధాని, పోలవరం రెండింటిని వైసీపీ సర్వ నాశనం చేసిందని తెలిపారు.

5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించామని…పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం గోదారిలో కలిపేసిందని చెప్పారు. పోలవరం విషయంలో ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొందని తెలిపారు.

AlsoRead:కల్కి..అఫీషియల్ రన్ టైం!

- Advertisement -