సన్నీ డియోల్‌తో గోపిచంద్!

8
- Advertisement -

బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు దర్శకుడు గోపిచంద్ మలినేని. రీసెంట్‌గా బాలయ్యతో వీరసింహారెడ్డితో హిట్ కొట్టిన గోపిచంద్ మలినేని తాజాగా రవితేజతో సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రవితేజ – గోపీచంద్ మలినేని కాంబో సూపర్ హిట్ హ్యాట్రిక్ కాంబో. వీరి కాంబోలో నాలుగో సినిమా కూడా ప్రకటించారు.

అయితే బడ్జెట్ పెరిగిపోవడంతో రవితేజ స్థానంలో సన్నీని తీసుకున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడు. హిందీలో తెరకెక్కించినా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తారని సమాచారం.

ఈ సినిమాతో గోపీచంద్ మలినేని బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

- Advertisement -