Chandrababu:అమరావతికి చంద్రబాబు

4
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ అమరావతిలో పర్యటించనున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు…వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతంతో పాటు ఇతర నిర్మాణాలను పరిశీలించనున్నారు.

మున్సిపల్ మంత్రి నారాయణ , సీఆర్డీఏ అధికారులతో కలిసి చంద్రబాబు పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో మొదట పోలవరం పర్యటన చేపట్టిన చంద్రబాబు ఇప్పుడు రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించబోతున్నారు.

త్వరలో అమరావతి స్టేటస్ రిపోర్టును చంద్రబాబు విడుదల చేయనున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో గత ఐదేళ్లలో నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయని ..70 నుంచి 80 శాతం నిర్మాణాలు పూర్తయిన భవనాలను కూడా వైసీపీ పట్టించుకోలేదన్నారు.

Also Read:కల్తీ మద్యం..29 మంది మృతి

- Advertisement -