నూకాంబికా అమ్మవారి సన్నిధిలో పవన్

11
- Advertisement -

జనసేన అధినేత, ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నుకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్.. ఎలాంటి ఆర్భాటం లేకుండా అమ్మవారి ఆలయానికి వెళ్లారు. పవన్ వెంట అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఉన్నారు.

కూటమి అధికారంలోకివస్తే నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని పిఠాపురం వెళ్తానని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే నూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొని పవన్ మొక్కును చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ కల్యాణ్ కు తిలకం దిద్ది ఆశీర్వదించారు.

ఏపీ సీఎంగా నాలుగోసారి చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12న బాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనుండగా డిప్యూటీ సీఎంగా పవన్‌ ఎన్నికయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Also Read:సన్ ఫ్లవర్ విత్తనాలతో ఎన్ని ప్రయోజనాలో?

- Advertisement -