గ్రూప్ 1 పరీక్ష..పటిష్ట బందోబస్తు

16
- Advertisement -

ఆదిలాబాద్ లోని పలు గ్రూప్ వన్ ప్రిలిమినరీ Itself కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌష్ ఆలం లు గ్రూప్-1 పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు.

ఉదయం 10 గంటల నుండి ప్రారంభమైన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నేపథ్యంలో కలెక్టర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆర్జెసి కళాశాల, క్రియేటివ్ హైస్కూల్, మౌంట్ ఫోర్ట్ హైస్కూల్, సెయింట్ జోసఫ్ హై స్కూల్, కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్, హార్వేస్ట్ హై స్కూల్, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల నందు ఏర్పాటు చేయబడిన పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు.అక్కడ విధులలో ఉన్న అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ను అమలు చేస్తూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

Also Read:బండి సంజయ్‌..కార్యకర్త నుండి కేంద్రమంత్రిగా

- Advertisement -