ఏపీలో టీడీపీ కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు వస్తున్న బెదిరింపు కాల్స్పై స్పందించారు నటి శ్యామల. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే.. జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా. ఎన్నికల్లో ప్రజలదే అంతిమ తీర్పు.. ముందుగా అఖండ విజయం సాధించిన కూటమికి ధన్యవాదాలు. పెద్దలు నారా చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురంధేశ్వరి గారికి హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే వైసీపీ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఎస్.. మేం ఓడిపోయాం.. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. గెలిచిన నాడు విర్రవీగలేదు.. ఓడిపోయిన నాడు కుంగిపోలేదు. అలాగే ఈసారి కూడా జగన్ మరింత బలాన్ని పుంజుకుని.. మనందరం కలిసి జగనన్నతో నడిస్తే.. మళ్లీ క్చితంగా మంచి ప్రభుత్వంలా ఏర్పాటు చేస్తాం. ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నా. ఎప్పటికీ జగనన్నతోనే నా ప్రయాణం. ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్కు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని వెల్లడించారు.
Also Read:విజయ్తో పల్లవి..ప్రేమకథ!