KTR:రేవంత్ చెప్పిన బలిదేవత ఎవరు?

10
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలంగాణ బలిదేవత ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్… కాంగ్రెస్‌ ప్రభుత్వాలు చేసిన దారుణాలను ప్రశ్నించారు. తెలంగాణలో వేలమంది ఎవరివల్ల అమరులయ్యారు..? అమరువీరుల స్థూపం ఎవరివల్ల నిర్మించాల్సి వచ్చింది..? అంటూ ప్రశ్నించారు.

రేవంత్‌రెడ్డి చెప్పినట్టుగా వేలాది మంది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు..?…ఈ ప్రశ్నకు మాత్రం ‘కాంగ్రెస్‌ పార్టీ’ అనే సమాధానం ఇవ్వకుండా ఖాళీగా వదిలేశారు.

Also Read:తలనొప్పి నుండి ఇలా బయటపడండి!

- Advertisement -