- Advertisement -
సుప్రసిద్ధ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) మాతృమూర్తి శ్రీమతి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) గురువారం (30-5-24) 3 గంటల ప్రాంతంలో హృదయ సంబంధిత వ్యాధితో స్వర్గస్థులయ్యారు. ఆవిడకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు.
రాధాకృష్ణ గారు ఆవిడకు రెండవ తనయుడు. నిర్మాత సూర్యదేవర నాగ వంశీ కి నాగేంద్రమ్మ నాయనమ్మ అవుతారు. రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఫిల్మ్ నగర్ లోని విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read:KTR: చార్మినార్ గుర్తును తొలగిస్తారా?
- Advertisement -