కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా..?ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా..? అని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు.ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణం, అత్యంత బాధాకరం అన్నారు.
సాగునీరు, కరెంటు మాత్రమే కాదు.. విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుంది…కాంగ్రెస్ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయి. ఐదు నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. రైతన్నలపై లాఠీలు ఝులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పాలి. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి..రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, విత్తనాలను పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా..?
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా..?ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణం, అత్యంత బాధాకరం.
సాగునీరు, కరెంటు మాత్రమే కాదు.. విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్… pic.twitter.com/DxNp3MrEs6
— Harish Rao Thanneeru (@BRSHarish) May 28, 2024