KTR:ఆ ఇద్ద‌రు మంత్రులకు ఎస‌రు

14
- Advertisement -

తెల్లారి లేస్తే బూతులు, పెద్ద వాళ్ల‌ను తిట్ట‌డం, బెదిరించ‌డం, బ్లాక్ మెయిల్ చేయ‌డం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ప‌ని ఇదేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన‌ ఖ‌మ్మం – వ‌రంగ‌ల్ – న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో బీఆర్ఎస్ అభ్య‌ర్థి రాకేశ్ రెడ్డికి మ‌ద్ద‌తుగా కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

తీన్మార్ మల్లన్నతో మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో మిగ‌తా కాంగ్రెస్ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ఎస‌రు త‌ప్ప‌ద‌ని అన్నారు. ఆయ‌న‌పై 56 కేసులు ఉన్నాయి. ఇవి ఆయ‌న‌ గుణ‌గ‌ణాలు.. మ‌రి బిట్స్ పిలానీలో చ‌దివి స‌మాజం మీద అవ‌గాహ‌న ఉన్న విద్యావంతుడికి ప‌ట్టం క‌డుతారా..? బ్లాక్ మెయిల‌ర్‌కు ప‌ట్టం క‌డుతారా…? అనేది ప‌ట్ట‌భ‌ద్రులు ఆలోచించుకోవాలన్నారు.

ఇలాంటి చీట‌ర్ల‌కు, బ్లాక్ మెయిల‌ర్ల‌కు స‌పోర్ట్ చేస్తే.. రేపు మీకే ఎస‌రు పెడుతార‌న్న మాట‌ను కూడా వారు గుర్తుంచుకోవాలన్నారు. స‌మాజానికి ప‌ట్టిన చీడ‌పురుగులు, బ్లాక్ మెయిల‌ర్ల‌ను, క్రిమిన‌ల్ కేసులు ఉన్న వ్య‌క్తిని ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎలా ప్ర‌కంటించిందో చెప్పాలన్నారు.

Also Read:10 యూనివర్సిటీలకు ఇంఛార్జీ వీసీలు..

- Advertisement -