KCR:రైతులకు అండగా బీఆర్ఎస్

25
- Advertisement -

కరీంనగర్‌ జిల్లా రూరల్‌ మండలం ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు మాజీ సీఎం కేసీఆర్. రైతులతో మాట్లాడిన కేసీఆర్… పొలాలకు నీటి సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

రైతులు ధైర్యంగా ఉండి పోరాటం చేయాలని… రైతులకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఉంటుందని తెలిపారు. సాగునీటికి తీవ్ర ఇబ్బందవుతుందని …గత సంవత్సరం నీరు సంవృద్ధిగా ఉండేదని.. వరి కోత కోసేందుకు ఇబ్బందయ్యేదని పేర్కొన్నారు.

ఒకసారి వాగులోకి నీళ్లిస్తే రైతులందరు బతుకుదురని చెప్పారన్నారు. మంచినీళ్లకు కూడా గోసవుతుందని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారని… పోయిన సంవత్సరం మండుటెండల్లో కూడా చెక్‌డ్యామ్‌లు మత్తడి పోశాయన్నారు. రైతులకు బీఆర్‌ఎస్‌ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు.

Also Read:ఐస్ క్రీమ్ తింటున్నారా..జాగ్రత్త!

- Advertisement -