మార్చి 4 నుండి డీఎస్సీ..దరఖాస్తుల స్వీకరణ

10
- Advertisement -

11062 పోస్ట్ లతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డీఎస్సీ 2023లో 5089 పోస్టుల కే నోటిఫికేషన్ విడుదల చేయగా పాత నోటిఫికేషన్ రద్దు చేశారు. అప్పటి కంటే డబుల్ పోస్టుల తో కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు.

మార్చి 4 నుండి ఏప్రిల్ 3 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరించనుండగా ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. గతంలో ఉన్నట్టుగానే వెయ్యి రూపాయల ఫీజు ఉండగా 18 ఏండ్ల నుంచి 46 ఏండ్లలోపు అభ్యర్థులు DSC 2024 పోస్టులకు అర్హులు.

ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. 11 కేంద్రాల్లో ఆన్ లైనలో పరీక్షలు నిర్వహించనుండగా త్వరలోనే పరీక్షా తేదీల ప్రకటన చేయనున్నారు. పాత పోస్టులకు అదనంగా 4957 జనరల్ టీచర్ పోస్టులు, 1016 స్పెషల్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

Also Read:హిట్ కొట్టకపోతే.. కెరీర్ ముగిసినట్లే!

- Advertisement -