పాక్ ఇంటికి..సెమీస్‌కు కివీస్

38
- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌లోకి ఎంటరైంది న్యూజిలాండ్. ఈడెన్ గార్డెన్స్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 93 పరుగుల తేడాతో విజయం సాధించడంతో న్యూజిలాండ్ సెమీస్‌లోకి ప్రవేశించింది. 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 43.3 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. అబ్దుల్లా షఫీక్ (0), ఫకార్ జమాన్ (1) విఫలం కాగా బాబర్ ఆజమ్ (38), మహ్మద్‌ రిజ్వాన్ (36), సాద్ షకీల్ (29), సల్మాన్ 51 పరుగులు చేశారు. అయితే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఎవరు పెద్ద స్కోరు సాధించకపోవడంతో పాక్ ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే 3 , ఆదిల్ రషీద్, అట్కిన్ ‌సన్, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. బెన్‌ స్టోక్స్‌ (84), జో రూట్ (60), జానీ బెయిర్‌ స్టో (59) రాణించడంతో 337 పరుగుల భారీస్కోరు సాధించింది. పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది, మహ్మద్‌ వసీమ్ జూనియర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Also Read:చిన్నా..ఓటీటీ డేట్ లాక్!

- Advertisement -