రాజకీయాల చుట్టూ ఎన్టీఆర్ ‘దేవర 2’

54
- Advertisement -

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. భయానికి కొత్త పేరు ఉంటే అదే దేవర. మరో 150 రోజుల్లో విధ్వంసాన్ని థియేటర్లలో వీక్షించేందుకు సిద్ధంగా ఉండండి అని ట్వీట్ చేశారు. ఎన్టీఆర్, జాన్వీ క‌పూర్ జంట‌గా తెర‌కెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమా కొత్త షెడ్యూల్ రీసెంట్‌గా గోవాలో మొద‌లైంది. అన్నట్టు నిన్నటితో ఈ షెడ్యూల్ ఇటీవ‌లే పూర్తి చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాకు సంబంధించిన త‌ర్వాతి షెడ్యూల్‌ను మేక‌ర్స్ అతి త్వ‌ర‌లోనే స్టార్ట్ చేయ‌నున్నార‌ట‌.

వచ్చే షెడ్యూల్ లో ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇక దేవర రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. అన్నట్టు దేవర క్లైమాక్స్ ఓ ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దేవర ఫస్ట్ పార్ట్ 1 ఎండింగ్ లో దేవర (ఓల్డ్ ఎన్టీఆర్) ను రివీల్ చేసి.. సీక్వెల్ లో ఆ ఓల్డ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారీ యాక్షన్ డ్రామా ఉంటుందట. ముఖ్యంగా సెకండ్ పార్ట్ మొత్తం పొలిటికల్ డ్రామా ఉంటుందని.. ఏపీ రాజకీయాలను కూడా టచ్ చేస్తారని అంటున్నారు. నిజంగా దేవర రెండో భాగం మొత్తం రాజకీయాల పై నడిస్తే.. నిజంగా అది సంచలనమే.

Also Read:డీప్‌‌ఫేక్‌.. హీరోయిన్లే కాదు.. అందరూ!

కారణం.. జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న ఇమేజ్.. తెలుగుదేశం పార్టీకి ఉన్న చరిత్ర మొత్తంగా దేవర రెండో భాగం ద్వారా.. రాజకీయాల పట్ల తన ఆలోచనలను, పట్టుదలను ఎన్టీఆర్ చూపించబోతున్నాడు. అందుకే తన ఇమేజ్ తో పాటు తన పాన్ ఇండియా స్టార్ డమ్ ను కూడా పక్కన పెట్టి.. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం కిందామీదా పడుతున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తోందో చూడాలి. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఏప్రిల్ 4న పార్ట్1 రిలీజ్ కానుంది. అన్నట్టు ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

- Advertisement -