CM KCR:రెండో విడత ప్రచారం నేటినుండే

24
- Advertisement -

సీఎం కేసీఆర్ ఇవాళ్టి నుండి రెండో విడత ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అచ్చంపేట, వనపర్తి, మునుగోడు నియోజకవర్గాల్లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అచ్చంపేట, 2 గంటలకు వనపర్తి, 3 గంటలకు మునుగోడు సభల్లో పాల్గొంటారు.

సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఈ మూడు నియోజకవర్గాలు గులాబీ మయంగా మారాయి. 19 నుంచి 25 వరకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో ప్రజా ఆశీర్వాద సభలకు విరామం ప్రకటించారు.

అక్టోబరు 27- మహబూబాబాద్‌,వర్దన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్‌,అక్టోబరు 28- కోదాడ, తుంగతుర్తి, ఆలేరు,అక్టోబరు 30- జుక్కల్‌ , బాన్సువాడ,నారాయణఖేడ్‌,అక్టోబరు 31- హుజూర్‌నగర్‌,మిర్యాలగూడ, దేవరకొండ,నవంబర్ 01- సత్తుపల్లి, ఇల్లందు,నవంబర్ 02- నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

Also Read:సందీప్ కిషన్…ఊరు పేరు భైరవకోన

నవంబర్ 03- భైంసా (ముథోల్‌),ఆర్మూర్‌, కోరుట్ల,నవంబర్ 05- కొత్తగూడెం, ఖమ్మం,నవంబర్ 06-గద్వాల్‌, మక్తల్‌, నారాయణపేట్‌,నవంబర్ 07- చెన్నూరు, మంథని, పెద్దపల్లి,నవంబర్ 08- సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి,నవంబర్ 09- గజ్వేల్‌, కామారెడ్డి నుంచి కేసీఆర్‌ నామినేషన్‌ దాఖలు చేసి అక్కడ ఏర్పాటు చేసే బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు.

- Advertisement -