బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి పొన్నాల..

37
- Advertisement -

టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్‌లో చేరారు. జనగామలో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే జనగామకు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌ తీర్థం స్వీకరించారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు పొన్నాల. రానున్న రోజుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరింత ముందుకు పోతుందన్నారు. మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని తెలిపారు పొన్నాల.

పల్లా రాజేశ్వర్‌రెడ్డిని తిరుగులేని మెజార్టీతో గెలిపించాలని….అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు.

Also Read:కూరగాయలను పచ్చిగా తింటే ప్రమాదమా?

- Advertisement -