పవర్ స్టార్ మానియా..

56
- Advertisement -

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో ఆయన్ను అనుసరించే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. తాజాగా ఇన్‌స్టా వేదికగా ఆయన్ను అనుసరించే వారి సంఖ్య రెండు మిలియన్లకు చేరుకుంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. పైగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డు సృష్టించారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన 380 నిమిషాల్లో 1.7 మిలియన్ల ఫాలొవర్స్‌ను సంపాదించుకున్న ఏకైక తెలుగు హీరోగా రికార్డు నెలకొల్పారు.

ఇంకా పవన్ కళ్యాణ్ ఫాలోవర్ల కౌంట్ పెరుగుతూనే ఉంది. ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్‌‌‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో 7 లక్షల మంది ఫాలో అవుతున్నారు. దీంతో పవన్ జనం మెచ్చిన నేత అంటూ జనసేన శ్రేణులు, అభిమానులు అంటున్నారు. అలాగే మిగిలిన స్టార్ హీరోల కంటే కూడా పవన్ కల్యాణే వేగంగా 1 మిలియన్ ఫాలోవర్ల మార్క్ ను అందుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్ 23 రోజుల్లో వన్ మిలియన్ ఫాలోవర్ల మార్క్ ను అందుకుంటే, రామ్ చరణ్ 74 రోజులు, మహేశ్ బాబు 89 రోజులు, అల్లు అర్జున్ 184 రోజులు, జూనియర్ ఎన్టీఆర్ 416 రోజుల్లో 1 మిలియన్ ఫాలొవర్స్ సంపాదించుకున్నారు.

Also Read:బీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు..

మొత్తానికి అందరి హీరోల కంటే పవన్ కళ్యాణ్ ముందు ఉండటం విశేషం. పైగా అటు రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో పవన్ కి గెలుపు ఖాయం అని పవన్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ ఇప్పటికే బ్రో సినిమా షూటింగ్ ను ఫినిష్ చేశారు. ప్రస్తుతం దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కు డేట్స్ ఇవ్వనున్నాడు.

Also Read:మెరిసే దంతాల కోసం..

- Advertisement -