యువసామ్రాట్ నాగచైతన్య హీరో రకుల్ జంటగా నటించిన చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’మరి ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగ్ నిర్మాణంలో కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను, మే 19వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు.అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రాల తర్వాత వస్తున్న మరో సూపర్హిట్ చిత్రం ‘రారండోయ్.. వేడుక చూద్దాం’. అయితే ఆ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం సందేహమేననే టాక్ వినిపిస్తోంది.
ఎందుకంటే .. ఈ సినిమాను చూసిన నాగార్జున కొన్ని సలహాలు .. సూచనలు ఇచ్చాడట. ఆ ప్రకారం సరిచేయడానికి కొంత సమయం పడుతుంది కనుక, మే 19న కాకుండా 26వ తేదీన విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే ఈ విషయంపై అధికారికంగా స్పష్టత రావలసి వుంది. ‘నిన్నే పెళ్లాడుతా’ తరహాలో లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఈ సినిమా తెరకెక్కిందని నాగ్ చెప్పడంతో, ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి మొదలైంది.
దర్శకుడు కళ్యాణ్కృష్ణ కురసాల…ఇప్పటివరకు 80 శాతం షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ ఎండ్ వరకు జరిగే షెడ్యూల్తో టోటల్గా షూటింగ్ పూర్తవుతుంది. సమ్మర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లానింగ్ జరుగుతోంది. సోగ్గాడే చిన్నినాయనా తర్వాత మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో మరో భారీ చిత్రం చేస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. నాగచైతన్య కెరీర్లో ఇది ఓ మెమరబుల్ మూవీ అవుతుంది. దర్శకుడిగా నాకు ఎంతో సంతృప్తిని కలిగిస్తున్న చిత్రమిది. కమర్షియల్గా డెఫినెట్గా చాలా మంచి సినిమా అవుతుంది” అన్నారు.