ఆదిపురుష్‌: అనుకోని అతిథి

49
- Advertisement -

ఆదిపురుష్ విడుదలకు ముందే జోరు మొదలైంది. థియేటర్‌ల వద్ద ఆదిపురుష్‌ కోసం జన సంద్రోహం కనిపిస్తుంది. రామాయణం వంటి గొప్ప కథ నేపథ్యంలో సినిమా తెరకెక్కడంతో జనాల్లో ఎక్కడలేని హైప్‌ జోరందుకుంది. ఇక ఈ సినిమా ప్రదర్శితమయ్యే అన్ని థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీటును కేటాయించింది. హనుమంతుడు వచ్చి సినిమా చూస్తాడనే నమ్మకంతో ఇలా ఒక సీటు కేటాయించినట్టు మూవీ మేకర్స్‌ ప్రకటించారు.

Also Read: 1920 ట్రైలర్ టెర్రిఫిక్ గా ఉంది: నాగార్జున

తాజాగా ఆదిపురుష్‌ ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్‌లోకి వానరం వచ్చింది. అలానే కాసేపు స్క్రీన్‌ వైపు చూసింది. దాంతో హనుమంతుడి వచ్చి సినిమా చూస్తున్నాడంటూ ఆ థియేటర్‌లోని ప్రేక్షకులు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. ప్రస్తుతం ఆ వానరం సినిమా చూసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్‌ రాముడి పాత్ర పోషించగా..సీతగా కృతిసనన్ నటించింది. లంకేష్‌గా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. ఈ సినిమాను ఓం రౌత్‌ తెరకెక్కించారు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

Also Read: యూట్యూబ్ లో ఆదిపురుష్ లీక్

- Advertisement -