CMKCR:దేశానికి సమర్థవంతమైన నాయకులను తీర్చిదిద్దాలి

55
- Advertisement -

దేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేనివిధంగా బీఆర్ఎస్ హెచ్‌ఆర్డీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌. కోకాపేటలో 11ఎకరాల స్థలంలో 15అంతస్థుల్లో నిర్మితమవుతున్న ఈ బీఆర్ఎస్ హెచ్‌ఆర్డీ భవనంలో అనేక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో నిర్మించనున్నారు. ఇందులో భావి భారత నిర్మాతలుగా రేపటి యువతను తయారు చేసే దిశగా దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారుచేసే విధంగా ఈ భవన్‌ నిర్మించనున్నారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సమాజాభివృద్ధికి దోహదం చేసే సమర్థవంతమైన నాయకత్వం వర్తమాన భారతానికి అవసరమని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ దిశగా ప్రపంచ వ్యాప్తంగా ఆయా రంగాల్లో అనుభవజ్ఞనులైన గొప్ప గొప్ప మేధావులను నోబుల్ లారేట్లను కూడా పిలిచి నాయకత్వ శిక్షణనిప్పిస్తామని అన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించే నాయకత్వాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. దేశం నలుమూలలనుంచి వచ్చే సామాజిక కార్యకర్తలకు రాజకీయ వేత్తలకు నాయకులకు భారత్ భవన్ లో సమగ్రమైన సమస్త సమాచారం లభ్యమౌతుందని సిఎం అన్నారు. రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో శిక్షణనిచ్చేందుకు దేశం నలు మూలలనుంచి అనుభవజ్జులైన రాజనీతి శాస్త్రజ్జులు, ఆర్థిక వేత్తలు సామాజిక వేత్తలు సమాజాభివృద్ధికి దోహదం చేసే రచయితలు ప్రొఫెసర్లు విశ్రాంత అధికారులు తదితరులను ఆహ్వానించనున్నట్టు సిఎం తెలిపారు. శిక్షణ కోసం వచ్చే వారికోసం, శిక్షణ పొందే వారి కోసం వసతులను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. శిక్షణకు అనుగుణంగా.. తరగతి గదులు, ప్రొజెక్టర్ తో కూడిన మినిహాల్స్, విశాలమైన సమావేశ మందిరాలు, అత్యాధునిక సాంకేతికత కలిగిన డిజిటల్ లైబ్రరీలు, వసతికోసం లగ్జరీ గదులు నిర్మితమౌతాయని సిఎం అన్నారు.

దేశ విదేశాల వార్తా పత్రికలు అందుబాటులో వుంటాయని తెలిపారు. ప్రపంచ రాజకీయ సామాజిక తాత్విక రంగాలకు చెందిన ప్రపంచ మేధావుల రచనలు, గ్రంధాలు అందుబాటులో వుంటాయన్నారు. స్థానిక, దేశీయ, అంతర్జాతీయ మీడియా ఛానల్లు సమాచార కేంద్రాలుండే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా…సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో చోటు చేసుకునే పురోగతిని పరిశీలించే వేదికలను అందుబాటులోకి తెస్తామన్నారు. వార్తలు కథనాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ విశ్లేషించి, క్రోడీకరించే వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నామని అధినేత తెలిపారు.

Also Read: అమిత్ షాతో రెజ్లర్ల చర్చలు.. నో యూస్ !

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, బిఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్, బిబి పాటిల్, రంజిత్ రెడ్డి, దామోదర్ రావు, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూధనాచారి, కవిత, శేరి సుభాష్ రెడ్డి, శంభీపూర్ రాజు, వెంకట్రామిరెడ్డి, మహేందర్ రెడ్డి, గోరెటి వెంకన్న, ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, దానం నాగేందర్, కాలె యాదయ్య, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, రవీందర్ సింగ్, రాజీవ్ సాగర్, సతీష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, కార్తీక్ రెడ్డి, సాయిచంద్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, అనిల్ కూర్మాచలం, సోమ భరత్, జడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి, గ్యాదరి బాలమల్లు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.

Also Read: CMKCR:బీఆర్ఎస్‌ హెచ్‌ఆర్‌డీ కార్యాలయం శంకుస్థాపన

- Advertisement -