చరణ్ కోసం ఏఆర్ రెహమాన్ ?

44
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాని వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మించనున్నారు. దీని షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ పేరు తాజాగా వినిపిస్తోంది. ఇది నిజమే అయితే.. దాదాపు 7 ఏళ్ల తర్వాత ఆయన మరోసారి తెలుగు మూవీకి సంగీతం అందించబోతున్నారు. మరి దీనిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చుడాల్సిందే. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌ గా తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. మరి, బుచ్చిబాబు రష్మికకి ఈ క్రేజీ ఆఫర్ ఇస్తాడా ? లేదా ? అనేది చూడాలి.

ప్రస్తుతానికి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తోంది. వారిలో ఒకరిగా రష్మిక కాగా మరొకరు శ్రీనిధి శెట్టి ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉంది. ఈ పాత్ర.. కథనే మలుపు తిప్పుతుంది. అందుకే, ఈ పాత్రలో అమితాబ్ బచ్చన్ ను ఒప్పించాలని బుచ్చిబాబు ప్రయత్నాలు చేస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమా ఒప్పుకుంటాడని బుచ్చిబాబు నమ్మకంగా ఉన్నాడు. ఈ చిత్రం పీరియాడిక్ మూవీ. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం జరగనుంది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో జరిగిన కొన్ని పరిస్థితుల ఆధారంగా కథ మొదలవుతుందట.

ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడు. కథ చాలా మలుపులు తిరుగుతుందట. అమితాబ్ బచ్చన్ – చరణ్ మధ్యే భీకరమైన పోరు జరుగుతుందని.. దేశం కోసం అమితాబ్ బచ్చన్ పాత్ర ప్రాణ త్యాగం చేస్తోందని కూడా తెలుస్తోంది. మొత్తానికి ఈ కథ చాలా బరువైనది. ఇలాంటి బరువైన కథలో బలమైన నటులు నటిస్తే.. ఆ అపూర్వమైన నటనా సామర్ధ్యాలను చూడటానికి మన రెండు కళ్ళు చాలవు. ఈ వార్త వాస్తవ రూపం దాల్చితే.. భారతీయ సినీ తెరకు మరో పండుగ ఖరారు అయినట్టే.

ఇవి కూడా చదవండి…

Kollywood:మారితో ధనుష్ మరో కొత్త సినిమా..!

ఉగ్రం..అల్బెలా అల్బెలా సాంగ్‌ లాంచ్‌ బై నాని

ఆస్కార్ విన్నర్స్ కు అభినందన

- Advertisement -