Tirumala:పోటెత్తిన భక్తులు

24
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుండగా కంపార్టుమెంట్లన్ని నిండిపోయాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లన్నీ సర్వదర్శనం భక్తులతో నిండిపోగా క్యూలైన్‌ నారాయణగిరి కాటేజీలు, శిలాతోరణం మీదుగా గోగర్భం డ్యాం వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్ల దాకా వ్యాపించింది.

గదుల కోసం గంటల కొద్దీ సమయం భక్తులు నిరీక్షిస్తున్నారు. పరిమిత సంఖ్యలోనే గదులున్న నేపథ్యంలో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచిఉండాల్సి వస్తోంది. తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టలు కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -