దుబాయ్‌లో జక్కన్న టీం..

216
Rajamouli team off to Dubai to promote film
- Advertisement -

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ని క్రియేట్ చేసుకున్న చిత్రం  బాహుబలి. దీనికి సీక్వెల్‌గా తెరకెక్కన బాహుబలి-2 మరోవారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ రిలీజ్ కోసం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే‘బాహుబలి-2’ చిత్ర టీమ్ ప్రచార కార్యక్రమాల జోరు పెంచింది. సినిమా మూడు భాషలలో రిలీజ్ అవుతుంది. తెలుగు,తమిళం, హిందీల్లో సమాన స్థాయిలో ప్రమోషన్లను ‘బాహుబలి-2’ ప్లాన్ చేశారు. ఇప్పటికే ‘బాహుబలి-2’ ప్రి రిలీజ్ ఫంక్షన్, అలాగే మిగతా భాషల్లో ఆడియో వేడుకను భారీ స్థాయిలో  నిర్వహించారు.

ప్రస్తుతం‘బాహుబలి’ ప్రమోషన్‌లో భాగంగా రాజమౌళి టీం దుబాయ్‌ వెళ్లింది. అక్కడి సిటీ వాక్‌లోని రాక్సీ సినిమాస్‌లో 25న జరగనున్న ప్రచార కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, నటులు ప్రభాస్‌, రానా, అనుష్క పాల్గొననున్నారు. బాహుబలి చిత్రం బృందం దుబాయ్‌ రావడం పర్యటకశాఖకు కనులపండువలా ఉంటుందని దుబాయ్‌ కార్పొరేషన్‌ ఫర్‌టూరిజం అండ్‌ కామర్స్‌ మార్కెటింగ్‌ సీఈవో ఇస్సాం కాజిమ్‌ తెలిపారు.

ప్రచార కార్యక్రమంలో భాగంగా బాహుబలి సినిమా తెరవెనుక చేసే అద్భుతాల గురించి చూపించబోతున్నామని రోక్సీ సినిమాస్‌ ప్రతినిధులు తెలిపారు.ఇలాంటి సినిమాలు దుబాయ్‌లో ప్రదర్శించడం ద్వారా దుబాయ్‌, ఇండియా సత్సంబంధాలు మెరుగుపడతాయని ఇక్కడికి వచ్చే భారతీయ పర్యటకుల సంఖ్య కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. దీంతో 2020 నాటికి పర్యటకుల సంఖ్య 20 మిలియన్లకు చేరాలన్న లక్ష్యం కూడా నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -