బీజేపీ నేతల దుర్మార్గాలకు పరాకాష్ట..

20
jagadishreddy
- Advertisement -

ఆప్ నేత మనీశ్ సిసోడియా అరెస్ట్ బీజేపీ నేతల అరాచకానికి పరాకాష్ట అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన జగదీశ్ రెడ్డి..గత కొంతకాలంగా బీజేపీ నేతలు చేసిన ఆరోపణలపైనే ఎక్కువగా సీబీఐ ,ఈడీలు పనిచేస్తున్నాయని అర్థమవుతుందన్నారు. దేశంలో ఎమర్జెన్సీకి మించిన దారుణమైన పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు.

బీజేపీ నేతల కోసమే కేంద్ర నిఘా సంస్థలు పనిచేస్తున్నాయని..ప్రధాని మోడీ పాలనలో ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలు తమ స్వాతంత్య్రాన్ని కోల్పోయాయని విమర్శించారు. ఆ పార్టీ అరాచకాలు ఇలానే కొనసాగితే దేశ ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అణచివేతలు, జైళ్లను నింపడం ద్వారా ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని చరిత్ర చెబుతుందన్నారు.

కమలం పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లో నే ఉన్నాయన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బొడ్రాయి పండుగ అన్నారు. ప్రతీ ఒక్కరూ తమతమ మతాచారాలకు అనుగుణంగా దైవ చింత‌న‌ను కలిగి ఉండాలని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -