మహేష్ తో దీపికా.. క్రేజీ కాంబినేషనే!

26
- Advertisement -

సూపర్ స్టార్‌ మహేష్ బాబు – స్టార్ డైరెక్టర్ రాజమౌళి కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న క్రేజీ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ పాన్ ఇండియా సినిమాలో మహేశ్‌కు జంటగా నటించేందుకు బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ను తీసుకున్నారట. మహేష్ సరసన దీపికా పదుకొనే నటిస్తే.. ఆ స్క్రీన్ విజువల్స్ అదిరిపోతాయి. దీపికా పదుకొనే అయితే, ఈ సినిమాలో బాలీవుడ్ లో కూడా భారీ హైప్ క్రియేట్ అవుతుంది. షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో దీపికా పదుకొనే క్రేజ్ ప్రస్తుతం ఓ రేంజ్ లో ఉంది.

సో.. ఆ క్రేజ్ ను వాడుకోవడానికి రాజమౌళి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా గురించి మరో అదిరిపోయే అప్ డేట్ ఉంది. ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో విలన్ పాత్ర రివీల్ అవుతుంది. మహేష్ విలన్ గా తమిళ హీరో చియాన్ విక్రమ్ ను ఫైనల్ చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడు. మరి రాజమౌళి – మహేష్ సినిమాని విక్రమ్ ఒప్పుకుంటాడా ? లేదా ? అనేది చూడాలి.

ఇక రాజమౌళి మహేష్ నుంచి ఎలాంటి నటనను రాబడతాడో చూడాలి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పైగా మహేష్ – రాజమౌళి సినిమాకి ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే, మహేష్ సినిమా విషయంలో రాజమౌళి ఎక్కడా ‘తగ్గేదేలే’.. అంటూ ముందుకు వెళ్తున్నాడు. పైగా మహేష్ బాబుతో ఓ సాహసుడి కథను రాజమౌళి సినిమాగా చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -