పవన్ దర్శకుడితో బెల్లంకొండ?

14
- Advertisement -

బెల్లంకొండ శ్రీనివాస్ నుండి సినిమా వచ్చి రెండేళ్ళు దాటింది. అల్లుడు అదుర్స్ తర్వాత శ్రీను.. వినాయక్ తో ఛత్రపతి హిందీ రీమేక్ మొదలు పెట్టాడు. బ్రేకులు బ్రేకులుగా షూటింగ్ జరిగింది. సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే ఓవర్ అవ్వడంతో మేకర్స్ ఇప్పుడు థియేటర్స్ కాకుండా ఓటీటీ కి అమ్మేసే ఆలోచనలో ఉన్నారు. రెండేళ్ళుగా ఈ సినిమా కోసమే పనిచేసిన బెల్లంకొండ ఇప్పుడు ఈ సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను పకరించేందుకు రెడీ అవుతున్నారు.

ఈ రీమేక్ సినిమా తర్వాత బెల్లంకొండ తాజాగా ఓ దర్శకుడికి ఒకే చెప్పాడట. రెండు చిన్న సినిమాలు చేసి పవన్ కళ్యాణ్ , రానాలతో భీమ్లా నాయక్ తీసిన సాగర్ చంద్ర బెల్లంకొండ కి రీసెంట్ గా ఒక కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట. ఈ కాంబో సినిమాను నిర్మించే బేనర్ డీటైల్స్ తెలియాల్సి ఉంది.

భీమ్లా నాయక్ తో సాగర్ కి అనుకున్నంత ఇమేజ్ రాలేదు. ఆ సినిమా విషయంలో త్రివిక్రమ్ కే ఎక్కువ క్రెడిట్ దక్కింది. సినిమా కూడా టికెట్ రేట్ ప్రాబ్లెమ్ తో ఓ మోస్తారు కలెక్షన్స్ రాబట్టి యావరేజ్ అనిపించుకుంది. మా ఇప్పుడు సాగర్ బెల్లం కొండ సినిమాతో దర్శకుడిగా తనెంతో రుజువు చేసుకోవాల్సిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -