భారత్ టూర్..బంగ్లా జట్టు ఇదే

282
bangladesh
- Advertisement -

భారత్‌తో టూర్‌కు బంగ్లాదేశ్ జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించగా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా చేరాడు. వెస్టిండీస్, జింబాబ్వేతో జరిగిన చివరి రెండు వన్డే సిరీస్‌ల నుండి షకీబ్ అల్ హసన్ విరామం తీసుకున్నాడు. టీమిండియాతో డిసెంబర్‌లో జరిగే వన్డే జట్టులో షకీబ్‌ను మరోసారి జట్టులో బంగ్లా సెలక్టర్లు ఎంపిక చేశారు.

2015 తర్వాత తమ తొలి ద్వైపాక్షిక సిరీస్ కోసం భారత్ జట్టు డిసెంబర్ 1న బంగ్లాదేశ్ కు చేరుకుంటుంది. మొదటి, రెండు వన్డేలు డిసెంబర్ 4, 7 తేదీల్లో ఢాకాలో జరుగుతాయి. మూడో వన్డే డిసెంబర్ 10న చిట్టగాంగ్ లో జరగుతాయి.

బంగ్లాదేశ్ జట్టు: తమీమ్ ఇక్బాల్ (కెప్టెన్), లిటన్ దాస్, అనాముల్ హక్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ఎబాడోట్ హుస్సేన్, నసీమ్ హమీద్, మహ్మదుల్లా, నజ్ముల్ శాంటో, నురుల్ హసన్.

ఇవి కూడా చదవండి..

- Advertisement -