మొక్కలు నాటిన నటి సుమయా రెడ్డి..

67
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు నటి సుమయా రెడ్డి. ఈ సందర్భంగా నటి సుమయా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ఇండియా చాలెంజ్ చేపట్టడమే కాకుండా నాలుగు సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగడం గొప్ప విషయం అన్నారు.

రేపటి తరాలకు మంచి ఆక్సిజన్ వాతావరణం లభించాలంటే ప్రతి ఒక్కరు ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. చెట్లు నరికి బిల్డింగ్ లు కడుతున్నారు ఎంత పెద్ద విలాసవంతమయిన ఇల్లు ఉన్నప్పటికీ పచ్చని వాతావరణం లేక మళ్ళీ మొక్కలు నాటుతున్నారు దీన్ని బట్టి అర్ధం అవుతుంది మొక్కల ఉపయోగం అన్నారు.అనంతరం తుషార్, నిహారిక కొనిదల,శృతి ముగ్గురిని మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -