మహిళలు ఏదైనా సాధించగలరు : రుచిరా కాంబోజ్‌

137
ruchira
- Advertisement -

ఐరాసలో భారత రాయబారి రుచిరా కాంబోజ్‌ అరుదైన ఘనత సాధించారు. ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధిగా నియమితులయ్యారు. మనదేశం నుంచి ఈ రికార్డు సాధించిన మొదటి మహిళగా పేరు గాంచారు. 1987లో ఐఎఫ్‌ఎస్‌కు ఏంపికైన రుచిరా ….టీఎస్‌ తిరుమూర్తి స్థానంలో ఈ బాధ్యతలు చేపట్టారు. ఆ ఏడాది సివిల్‌ సర్వీసెస్‌లో మహిళా విభాగంలో ఆమె ఆలిండియా మొదటి ర్యాంకు, ఫారిన్‌ సర్వీసెస్‌లో కూడా మొదటి ర్యాంకు సాధించారు. ఈ తర్వాత పారిస్‌లో మొదట బాధ్యతులు స్వీకరించి దౌత్యాధికారిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత విదేశాంగ శాఖ కింద పనిచేశారు. అనంతరం మారిషస్‌, దక్షిణాఫ్రికా, భూటాన్‌ సహా మరికొన్ని దేశాల్లో సేవలు అందించారు.

ఈ జూన్‌లో ఆమె నియామకం ఖరారు కాగా దానికి సంబంధించి పత్రాలను నిన్న సమితి జనరల్‌ సెక్రటరీ ఆంటోనియో గుటెర్రస్‌కు సమర్పించారు. ఆ విషయాన్ని ఆమె ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఐరాస చీఫ్‌ ఆంటోనియోకు శాశ్వత ప్రతినిధిగా నా పత్రాలను సమర్పించాను. భారత్‌కు చెందిన ఒక మహిళకు తొలిసారి ఈ పదవి దక్కడం ఒక గొప్ప గౌరవం. మహిళలందరికీ నేను చెప్పేదొక్కటే మనం ఏదైనా సాధించగలం అని ఆమె బాధ్యతలు స్వీకరిస్తోన్న చిత్రాన్ని షేర్‌ చేశారు.

- Advertisement -