ఏపీలో RC15!

85
rc15
- Advertisement -

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం RC15. భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా త్వరలో మూడో షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నారు.

ఈ తాజా షెడ్యూల్‌ని కూడా ఏపీలోని కర్నూల్, ఏలూరు ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. తొలుత సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేద్దామనుకున్న ఆ తర్వాత సమ్మర్ కి వాయిదా వేశారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ముంబై, పుణె, పంజాబ్, వైజాగ్, గోదావరి జిల్లాల్లో దోసకాయల పల్లి, రాజమండ్రి, కాకినాడ, కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది.

- Advertisement -