బీజేపీ అస‌త్య ప్ర‌చారాన్ని తిప్పికొట్టాలి: జ‌గ‌దీష్ రెడ్డి

47
minister Jagadhish reddy
- Advertisement -

వాట్సాప్ యూనివ‌ర్సిటీ కేంద్రంగా బీజేపీ చేస్తున్న అస‌త్య ప్ర‌చారాన్ని తిపికొట్టాల‌న్నారు మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి. కాంగ్రెస్‌ను కాద‌ని బీజేపీకి అధికారం ఇస్తే దేశాన్ని ప్ర‌మాద‌పు అంచున నిల‌బెట్టార‌న్నారు. రెడ్కో ఛైర్మ‌న్‌గా వై స‌తీష్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన సంద‌ర్భంగా మాట్లాడిన జ‌గ‌దీష్ రెడ్డి.. గుజరాత్ నమూనాను చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ అదే గుజరాత్ ను ఇప్పుడు చీకట్లోకి నెట్టేసిందన్నారు.

వ్యవసాయానికి ఆరు గంటలు కూడ కరెంట్ ఇవ్వకపోగా పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించిన గుజ‌రాత్ న‌మూనా విఫ‌ల‌మైంద‌న్నారు. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ దూసుకుపోతుంద‌న్నారు.

టీఆర్ఎస్‌లా పని చేస్తున్న పార్టీలు దేశంలో లేవు అన్నారు. కృష్ణా, గోదావరి జలాలను, రోడ్లు, మురుగునీటి కాలువలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. ఉద్యమ నేత ప్ర‌భుత్వ‌ అధినేత కావడం మన అదృష్టం. కరెంటు, సాగు, తాగు నీరు, అనేక పథకాలు సీఎం చేపట్టారని అన్నారు.

- Advertisement -