మైనర్‌ కేసు.. పోలీసుల నిర్ణయం సరైనదే..

82
ktr
- Advertisement -

జూబ్లీహిల్స్‌లో మైనర్‌పై అఘాయిత్యం జరిగిన కేసులో పోలీసుల దర్యాప్తు జరుగుతున్న విషయం తెలిసిందే.. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను జుబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మైనర్లుగా ఉన్న ఈ నిందితులను మేజర్లుగా పరిగణించాలని పోలీసులు జువైనల్ కోర్టును కోరే ఆలోచనలో ఉన్నారు. ఈ వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌ ట్వట్టర్‌ వేదికగా స్పందించారు. తెలంగాణ పోలీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని మంత్రి తెలిపారు. అఘాయిత్యాల వంటి అత్యంత దుర్మార్గమైన నేరాలకు పాల్పడే వారు మైనర్లు అయినా మేజర్లకు విధించే శిక్షలనే విధించాలని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

- Advertisement -