10 నుండి మహిళా దర్బార్..

111
tamilisai
- Advertisement -

ఈనెల 10 నుండి ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రారంభమవుతుందని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఇందులో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు మహిళా దర్బార్ నిర్వహించనున్నట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. గవర్నర్ తమిళి సై నేరుగా మహిళలను కలిసి సమస్యలను తెలుసుకోనున్నారు.

ప్రజల కోసమే రాజ్‌భవన్‌ పని చేస్తోందని… ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఇకపై నెలకోసారి ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని ప్రకటించారు. ఇప్పటికే రోజుకు 20 నుంచి 50 వరకు విజ్ఞప్తులు వస్తున్నాయని.. దీన్ని మరింత విస్తృతం చేసే క్రమంలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని గవర్నర్ తెలిపారు.

- Advertisement -