విజ‌య్ – సామ్‌కు గాయాలు..క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్‌!

86
samantha vijay
- Advertisement -

యంగ్ టాలెంటెడ్ హీరో విజ‌య్ – స‌మంత కాంబోలో ఖుషి సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. శివ నిర్వాణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ఇటీవ‌లె కాశ్మీర్ లో ఫ‌స్ట్ షెడ్యూల్ లో విజ‌య్‌, స‌మంత‌, వెన్నెల కిషోర్‌, శ‌ర‌ణ్యల‌పై స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించారు. అయితే ఈ సంద‌ర్భంగా విజ‌య్‌, స‌మంత గాయ‌ప‌డిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌హల్గామ్ ప్రాంతంలో స్టంట్ సీక్వెన్స్ చేస్తున్న‌ప్పుడు వీరిద్ద‌రు లిడ్డ‌ర్ న‌దికి రెండు వైపులా కట్టిన తాడుపై వాహనం నడపవలసి వచ్చిందట. కానీ ఆ సీన్‌ చేస్తున్నప్పుడు వాహ‌నం నీటిలో పడటంతో వీరికి గాయాలైనట్లు వార్త‌లు వినిపిస్తుండ‌గా దీనిపై క్లారిటీ ఇచ్చారు మేక‌ర్స్‌.

సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతున్న‌ వార్త‌ల్లో నిజం లేద‌ని చిత్ర‌యూనిట్ తెలిపింది .ఈ మేర‌కు అఫిషియ‌ల్ ట్వీట్ చేసిన మేక‌ర్స్‌..ఇదంతా త‌ప్పుడు ప్ర‌చారం అని..దీనిని న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు.30 రోజుల పాటు క‌శ్మీర్ షెడ్యూల్‌ని స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుని టీమ్ అంతా తిరిగి హైద‌రాబాద్ చేరుకుంద‌ని..ఇలాంటి వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు.

ఇక జూన్‌లో రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుండ‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 23న తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుంది.

- Advertisement -