లండన్‌లో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం..

98
- Advertisement -

ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ – యు.కే ఆధ్వర్యం లో లండన్ లో ఘనంగా టీఆర్ఎస్‌ పార్టీ 21 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ – యు.కే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి అద్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమం లో తెరాస నాయకులు, తెలంగాణ వాదులు హాజరు కావడం జరిగింది .కార్యక్రమం లో ముందుగా TRS పార్టీ జండాను అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి గారు ఆవిష్కరించి, అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, జయశంకర్ గారికి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి గారు మాట్లాడుతూ 2001 నుండి తెరాస పార్టీ స్వరాష్ట్ర సాధనలో చేసిన ఉద్యమాలను సభకు గుర్తు చేసారు. అదేవిదంగా స్వరాష్ట్రం కోసం ఉద్యమంలోనే కాకుండా ఇప్పుడు బంగారు తెలంగాణా నిర్మాణం కోసం అవకాశం కల్పించినందుకు కెసిఆర్ గారికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలిపారు. టి.ఆర్.ఎస్ పార్టీ లో ఉండటం మా అదృష్టం అనీ, తెలంగాణ ప్రజల ఆధరాభిమానాలే పునాదులుగా, అనుక్షణం రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 21వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా పార్టీ శ్రేణులందరికీ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల గారు మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చినందుకు తెరాస కార్యకర్త లకు కృతఙ్ఞతలు తెలిపారు. తెరాస ప్రభుత్వం చేస్తున్నటివంటి సంక్షేమ పధకాలు మరియు అభివృద్ధి పనులు గురించి సభకు వివరించారు.ఎన్నారైలంతా ముఖ్యమంత్రి కెసిఆర్ గారి వెంటే ఉన్నారని , భవిష్యత్తులో కూడా తెరాస ప్రభుత్వాన్నే ఎన్నారైలంతా కోరుకుంటున్నారని అవసరమైనప్పుడు వచ్చి పార్టీ గెలుపుకు కృషి చేస్తామని ప్రవాస తెలంగాణ వాదులు తెలిపారు.

కార్యక్రమంలో అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, ప్రదాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, సంయుక్త కార్యదర్శులు మల్లా రెడ్డి, రమేష్ ఇస్సంపల్లి అధికార ప్రతినిధులు రవి కుమార్ రేతినేని, రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జి నవీన్ భువనగిరి , నవీన్ మాదిరెడ్డి, ఈస్ట్ లండన్ ఇంచార్జి ప్రశాంత్ కటికనేని, మధు ఆబోతు,ప్రవాస తెలంగాణ వాదులు మట్టా రెడ్డి , గణేష్ , ఇతర సభ్యులు పాల్గొనడం జరిగింది.

- Advertisement -