అన్ని మతాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం-మంత్రి

112
minister ik reddy
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళుతుందని రాష్ట్ర అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో బుధవారం ఆయన పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్ లను పంపిణీ చేశారు. (బట్టలు, ఇతర సామగ్రి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నదని చెప్పారు.

బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు సారెలు పంపిణీ చేస్తున్నట్లు రంజాన్ క్రిస్మస్ పండుగలకు దుస్తులు అందిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాకు ఆరు వేల గిఫ్ట్ ప్యాక్‌లు వచ్చాయని తెలిపారు. నిర్మల్‌కు 2000 ముధోల్ కు 2500, ఖానాపూర్ నియోజకవర్గానికి 1500 కేటాయించామని.. నిర్మల్ కు అదనంగా1000 గిప్ట్ లు తెప్పించామని మంత్రి తెలిపారు. మసీదుల వారీగా అర్హులైన కుటుంబాలను ఎంపిక చేసి గిఫ్ట్‌లు అందిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 815 మసీదుల పరిధిలోని దాదాపు ఐదు లక్షలకు పైగా కుటుంబాలకు ప్రభుత్వం కానుక అందిస్తున్నదని మంత్రి అన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నజరానా ఇస్తున్నదని తెలిపారు. అనంతరం ఆయన రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జడ్పి చైర్ పర్సన్ విజయ లక్ష్మి రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ,అదనపు కలెక్టర్ హేమంత్, RDO రమేష్,FSCS చైర్మన్ ధర్మజి రాజేందర్,ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, తెరాస పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము,మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మదా ముత్యం రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, DMW అధికారి స్రవంతి, పట్టణ కౌన్సిలర్లు తెరాస నాయకులు, ముస్లిం మత పెద్దలు తదితరులు ఉన్నారు.

- Advertisement -