నేడు హైద‌రాబాద్‌లో మద్యం షాపులు బంద్‌..

45
- Advertisement -

హైద‌రాబాద్ న‌గ‌రంలో వైన్స్‌ షాపులు ఒక్కరోజు బంద్‌ కానున్నాయి. శనివారం హ‌నుమాన్ జ‌యంతి సందర్భంగా మద్యం షాపులపై పోలీసులు ఆంక్ష‌లు విధించారు. రేపు ఉద‌యం 6 గంట‌ల నుంచి ఆదివారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు మద్యం అమ్మకాలు జరుపరాదని షాపుల యజమానులకు పోలీసులు స్ప‌ష్టం చేశారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించి క‌ఠిన చ‌ర్య‌లు తప్పవని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం హెచ్చ‌రించారు.

ఇక ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే శోభాయాత్రకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. శనివారం నగరంలో హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్నారు. గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్ బండ్ హనుమాన్ ఆలయం వరకు ఈ శోభాయాత్ర సాగనుంది. అలాగే క‌ర్మ‌న్‌ఘాట్ హ‌నుమాన్ టెంపుల్ నుంచి మ‌రో యాత్ర కొనసాగ‌నుంది. క‌ర్మ‌న్‌ఘాట్ నుంచి చంపాపేట్, కోఠి ఉమెన్స్ కాలేజ్, నారాయ‌ణ‌గూడ మీదుగా తాడ్‌బ‌న్‌లోని హ‌నుమాన్ మందిర్ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

- Advertisement -