దిల్వాలే దుల్హానియా లేజాయేంగే, రిలీజైన తర్వాతి రోజుల్లోనే నాగార్జున `నిన్నే పెళ్లాడుతా` సినిమా రిలీజైంది. ఈ సినిమా వచ్చి దాదాపు రెండు దశాబ్ధాలు పూర్తయింది. అయితే ఈ సినిమాలో నాగార్జున, టబు, చంద్రమోహన్, గిరిబాబు, లక్ష్మి, సుధ లాంటి స్టార్లంతా తెరనిండుగా కనిపించి ఓ వండర్ క్రియేట్ చేశారనే చెప్పాలి.
క్రిష్ణవంశీని క్రియేటివ్ డైరెక్టర్గా నిలబెట్టిన సినిమా ఇది. అయితే ఆ సినిమాకి సీక్వెల్ వస్తుందని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. నాగార్జున ఫ్యాన్స్ అయితే కళ్లు కాయలు కాసేలా చూశారు. కానీ ఇంతకాలం అందుకు సంబంధించిన ఏ అప్డేట్ లేవు.
అయితే ఇన్నాళ్ళకి ఈసినిమాకి సంబంధించిన సీక్వెల్ లాంటి సినిమాని అక్కినేని కాంపౌండ్ సిద్ధం చేస్తోంది. ఈ చిత్రానికి ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేం కళ్యాణ్కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. జూబ్లీహిల్స్లో అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలోని ఓ హోటల్లో కళ్యాణ్కృష్ణ ఈ సినిమాకి స్క్రిప్టు రాసుకుని అటుపై చైతూ, నాగార్జునలను ఒప్పించి సెట్స్కెళ్లాడు.
ఇక మొత్తానికి ఈ సినిమా ఫస్ట్లుక్ మోషన్ పోస్టర్ని ఉగాది రోజున లాంచ్ చేసేందుకు రంగం సిద్ధంచేస్తున్నారు. త్వరలోనే నాగార్జున అధికారికంగా ట్విట్టర్లో వివరాల్ని ప్రకటించనున్నారు. ‘నిన్నే పెళ్లాడుతా’ సీక్వెల్ తరహాలో ఉండే ఈ సినిమాకి ‘రారండోయ్ వేడుక చూద్దాం’ అనే టైటిల్ని నిర్ణయించినట్టు సమాచారం. అన్నపూర్ణ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం చైతూకి సోలో హీరోగా మంచి పేరు తెస్తుందని అంటున్నారు.