సర్కార్‌ వారి పాట…థియేట్రికల్‌ బిజినెస్‌ అప్‌డేట్!

125
mahesh
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కున్న ఈ భారీ చిత్రానికి సంబధించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులని అలరిస్తుంది. మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. జాతీయ అవార్డ్ విజేత కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఆర్ మధి సినిమాటోగ్రాఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం ‘సర్కారు వారి పాట’ థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే, నైజాంలో ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ రూ.30 కోట్ల‌కు, ఆంధ్ర‌రాష్ట్రంలో రూ.50 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. మొత్తంమీద రెండు తెలుగు రాష్రాల్లో క‌లిపి రూ.80 కోట్ల వ‌ర‌కు ఈ బిజినెస్ జ‌రిగింద‌ని టాక్.

- Advertisement -