న్యూయార్క్‌లో చికెన్ రైస్ తింటున్న మంత్రి కేటీఆర్‌..

99
- Advertisement -

మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ పర్యటనకు సంబంధించి కొన్ని ఆసక్తికర ఫొటోలను ఆయన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. న్యూయార్క్ నగర కోలాహలం, సందడి నడుమ గతకాలపు మధుర జ్ఞాపకాలను కొన్ని నెమరువేసుకున్నానంటూ కేటీఆర్ స్పందించారు.

ఫైజర్ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశం అనంతరం న్యూయార్క్ వీధుల్లో విహరించాను. లెక్సింగ్ టన్ అవెన్యూ స్ట్రీట్-34లో ఓ ఫుడ్ స్టాల్ చూసి అక్కడ ఆగాను. చికెన్, రైస్, వేడి వేడి సాస్ తో హాయిగా ఆస్వాదించాను. ఇది ఎంతో బాగుంది… మీరు కూడా తినండి.. అంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

- Advertisement -