మల్లాపూర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన..

129
ktr
- Advertisement -

ఇవాళ హైదరాబాద్‌ మల్లాపూర్‌లో పర్యటించనున్నారు మంత్రి కేటీఆర్. నూతనంగా నిర్మించిన వైకుంఠ ధామాన్ని ప్రారంభించనున్నారు. నాచారంలో ఎస్టీపీ పనులకు భూమిపూజ చేయనున్నారు.

తర్వాత ఉప్పల్‌లో ఎస్సార్‌డీపీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులకు భూమిపూజ చేయనున్నారు. అదేవిధంగా ఉప్పల్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన థీమ్ పార్కును ప్రారంభించనున్నారు. అనంతరం రామంతాపూర్‌లో ఎస్ఎన్‌డీపీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బందోబస్తూ చర్యలను చేపట్టారు పోలీసులు.

- Advertisement -