పేద విద్యార్థులకు అండగా మంత్రి కేటీఆర్..

38
ktr
- Advertisement -

పేదరికంతో చదువుకు దూరమైన ఇద్దరు విద్యార్థులకు అండగా నిలిచారు మంత్రి కేటీఆర్. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలం రాజాపూర్‌ గ్రామానికి చెందిన ఆవునూరి అఖిల ఇంటర్మీడియట్‌లో 98 శాతం మార్కులతో ఎంబీబీఎస్‌లో సీటు సాధించింది. అయితే ఫీజులు కట్టేందుకు పైసలు లేకపోవడంతో అఖిల విద్యాభ్యాసానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. బాగా చదువుకొని ఉన్నతస్థితికి రావాలని అఖిలకు సూచించారు.

భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన స్పందన 95 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకుని టీఆర్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. స్పందన తల్లిదండ్రులు రోజువారీ కూలి పనులు చేసుకుంటూ ఆమెను చదివించారు. అయితే ఎంబీబీఎస్‌ ఫీజు కట్టేందుకు పైసలు లేకపోవడంతో ఆమె కుటుంబసభ్యులను ప్రగతిభవన్‌కు పిలిపించి ఎంబీబీఎస్‌కు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు.

- Advertisement -