యూపీ ఎన్నికలపై మౌర్య జోస్యం…

193
keshav mourya talk about bjp
- Advertisement -

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో క్లీస్ స్వీప్ చేస్తామని యూపీ బీజేపీ అధ్యక్షుడు కేశవ్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు. తాము 300 స్థానాల్లో విజయదుంధుభి మోగించడం ఖాయమని ఆయన చెప్పారు. ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ సరిగా అంచనా వేయలేక పోయాయని అన్నారు.

ఈ ఎన్నికల్లో మాత్రమే కాకుండా, 2019లో జరిగే సాధారణ ఎన్నికల్లో సైతం యూపీలో బీజేపీ హవానే కొనసాగుతుందని ఆయన జోస్యం చెప్పారు. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో అధికారం చేపట్టాలంటే ఏ పార్టీకైనా 202 స్థానాలు అవసరం. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తేల్చి చెప్పిన ఎగ్జిట్ పోల్స్… సీట్లను గెలుచుకునే విషయంలో మాత్రం బీజేపీకి 200 స్థానాల వరకు కట్టబెట్టాయి.

- Advertisement -