జీహెచ్‌ఎంసీ క్వార్టర్స్ ఇక మీవే- మంత్రి తలసాని

133
Minister Talasani
- Advertisement -

మీరు నివసిస్తున్న జీహెచ్‌ఎంసీ క్వార్టర్స్ ఇక మీవే కాబోతున్నాయి…క్వార్టర్స్ లలో నివసిస్తున్న ప్రజలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభవార్త చెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్, బన్సీలాల్ పేట డివిజన్ లోని న్యూ బోయగూడ, రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట ప్రాంతాల్లో లబ్ధిదారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల నుండి రెగ్యులరైజ్ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి కానుక ఇచ్చారని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన నాకు ఇక్కడి ప్రజల కష్ట సుఖాలు తెలుసన్నారు తలసాని.

జీహెచ్‌ఎంసీ క్వార్టర్స్, లీజు ల్యాండ్స్ లలో ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్న పేద, మధ్య తరగతి ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాను. పెద్ద మనసుతో రెగ్యులరైజ్ చేసేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి తలసాని. తమ ఇండ్లను రిజిస్ట్రేషన్ చేయాలన్న లబ్ధిదారుల విజ్ఞప్తితో నామమాత్రపు ధరకు రిజిస్ట్రేషన్ చేసేందుకు నిర్ణయించింది ప్రభుత్వం. మంత్రి శ్రీనివాస్ యాదవ్ చేసిన ప్రకటనతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, మున్సిపల్ మంత్రి కేటీఆర్‌, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -