అందరూ మరింత భాద్యతతో ఉండాలి- హీరో బాలకృష్ణ

120
- Advertisement -

నేడు నూతన సంవత్సర ఆగమనాన్ని పురస్కరించుకొని నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారు తెలుగు ప్రజలకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా, సంపదతో సరితూగాలని, దాంతో పాటూ ఆరోగ్యవంతులై సాగాలని ఆయన ఆకాంక్షించారు. శనివారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్‌లో నూతన సంవత్సరాదిని పురస్కరించుకొని నందమూరి బాలకృష్ణ కేక్ కట్ చేసి సంబారాలు జరుపుకొన్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో ఈ మహమ్మారి నుండి విముక్తి లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే ఓమిక్రాన్ వేరియంట్‌తో మహమ్మారి మరోమారు విజృంభిస్తున్న వేళ అందరూ మరింత భాద్యతతో మెలుగుతూ పూర్తి శక్తి సామర్థ్యాలతో రోగులకు సేవలు అందేలా చూడాలని సూచించారు. ఇంతటి విపత్కర పరిస్థితులలో క్యాన్సర్ లాంటి వ్యాధితో భాదపడే వారికి హాస్పిటల్ లోనికి వచ్చినంతనే స్వాంతన కలిగించేలా చూస్తూ అవసరమైన వైద్యాన్ని అందించడంలో BIACH&RI విజయం సాధించిందని ఆ కోవలోనే నూతన సంవత్సరంలోనూ ముందుకు సాగాలని చెప్పారు. ఇలాంటి పరిస్థితులలో సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు.

అనంతరం ఈ కార్యక్రమంలో డా. ఆర్ వి ప్రభాకర రావు మాట్లాడుతూ.. గత సంవత్సరంలో సంస్థ సాధించిన విజయాలను వివరిస్తూ భవిష్యత్తులోనూ వీటిని కొనసాగించాలని ఆకాంక్షించారు.అంతకు ముందు కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న డా. టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI; డా. ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI; డా. కల్పనా రఘునాథ్, ఆసోసియేట్ డైరెక్టర్, BIACH&RI లతో పాటూ పలువురు వైద్యులు, వైద్యేతర సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది శ్రీ నందమూరి బాలకృష్ణ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -