టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్

109
- Advertisement -

టీ20 వరల్డ్ కప్‌లో నేడు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. న్యూజిలాండ్ పై టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘన్ జట్టులోకి యువ స్పిన్నర్ ముజీబ్ పునరామగనం చేశాడు. కివీస్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. అబుధాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌.. టీమిండియా సెమీస్ అవకాశాలపై ప్రభావం చూపుతుంది. దీంతో భారత క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌పై ఫోకస్ పెట్టారు.

ఈ మ్యాచ్‌లో కివీస్‌ను ఆఫ్ఘనిస్ఘాన్‌ ఓడిస్తే భారత్‌కు సెమీస్ అవకాశాలు ఉంటాయి. లేదంటే తన చివరి మ్యాచ్‌లో నమీబియాపై టీమిండియా భారీ విజయం సాధించినా ఉపయోగం ఉండదు. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ గెలవాలని టీమిండియా అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

- Advertisement -