అధైర్య పడొద్దు..అండగా ఉంటాం:మంత్రి కేటీఆర్

121
ktr minister
- Advertisement -

రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రామంలో ఆరేండ్ల‌ చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై స్పందించారు మంత్రి కేటీఆర్. ఈ ఘటన అత్యంత బాధాకరమని… బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైద‌రాబాద్ నిలోఫర్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు.

బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాపకి మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల‌కు కేటీఆర్ సూచించారు. సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనన్నారు.

- Advertisement -